కాంగ్రెస్ జాతీయ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్కు చేరుకోనున్నారు.ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ముందుగా హైదరాబాద్ నుంచి వరంగల్కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్.. తిరిగి రాత్రి 7.30 గంటలకు మరల చెన్నైకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ సైతం వరంగల్ వెళ్తారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కాగా, అటు వరంగల్లోనూ రాహుల్కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా మంత్రులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.