బ్రేకింగ్: కాచిగూడలో ప్రమాదం.. ఆగి ఉన్న రైలును ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు

-

కాచిగూడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నింబోలి అడ్డ వద్ద ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఓ ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. చిలుకూరు-కాగజ్‌నగర్ ప్యాసింజర్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ చూసుకోకుండా రెండు రెళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, రైలు బోగీలు పక్కకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news