ఇండియా-అఫ్గాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు?

-

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరికాసేపట్లో భారత్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు అంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌లకు ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో వర్షం పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో వాన కురిసే అవకాశం ఉంది. కాగా టీమ్ ఇండియా ఒక మార్పుతో ఇవాళ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించనున్నట్లు సమాచారం.

సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డే లేకపోవడంతో వ‌ర్షం కార‌ణంగా అఫ్గానిస్తాన్‌, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. ఇదే జ‌రిగితే.. టీమ్ఇండియా సెమీ ఫైన‌ల్ అవ‌కాశాల‌ను ప్ర‌భావితం అవుతాయి. ఎందుకంటే సూప‌ర్ 8లో ఇండియా మూడు మ్యాచులు ఆడ‌నుంది. క‌నీసం 2 మ్యాచుల్లో విజ‌యం సాధిస్తేనే సెమీఫైన‌ల్‌కు వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news