రాజీనామాకు సిద్దమైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

-

ఎమ్యెల్యే రాజసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గోషామహాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయటానికి సిద్ధమని రాజాసింగ్ పేర్కొన్నారు. గోషామహాల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు నిధులిస్తే రాజీనామా చేస్తానని.. గోషామహాల్ ఉప ఎన్నికల్లో ఎవరకు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజసింగ్.

రాజీనామా చేయమని నా నియోజకవర్గం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి నిధులు ప్రకటించిన వెంనటే స్పీకర్ ను కలసి రాజీనామా లేఖ ఇస్తానన్నారు. గోషామహాల్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని.. జీహెచ్ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రాజసింగ్. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని.. ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని ఎమ్మెల్యే రాజసింగ్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news