సోనియా ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధులు వచ్చాయి – అమిత్ షా

-

భారత్ – చైనా యుద్ధం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. సోనియా ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ( ఆర్జీఎఫ్) కు చైనా నుంచి నిధులు వచ్చాయని ఆరోపించారు అమిత్ షా. ప్రధాని మోదీ హయాంలో భారత్ కు చెందిన ఒక్క ఇంచ్ భూమి కూడా కబ్జా కాలేదని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తైవాన్గ్ సెక్టార్లో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలలో భారత సైనికులు అద్భుత ధైర్య సాహసాలను ప్రదర్శించారని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే చైనా దళాలకు దీటుగా జవాబు చెప్పారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు మన భూమిలోని ఓ అంగుళం మేరకు అయినా ఎవరూ కబ్జా చేయలేరని అమిత్ షా స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news