కేజిఎఫ్ -2 సెట్లోకి రాఖీ బాయ్ ఎంట్రీ..!

-

కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక కేజిఎఫ్ ఘన విజయం సాధించడంతో కేజిఎఫ్ సీక్వెల్ కూడా చిత్రబృందం ప్లాన్ చేయగా ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ నటిస్తుండటం కూడా ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

అయితే కెజిఎఫ్ 2 కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలవగా… కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ గత కొన్ని రోజుల క్రితమే మళ్ళీ షూటింగ్ ప్రారంభించింది ఈ చిత్ర బృందం. హీరో యష్ ఇటీవలే కే జి ఎఫ్ సెట్లోకి అడుగుపెట్టాడు. ఇక సముద్రం ఒడ్డున నిలబడి అలలని చూస్తున్నా ఒక ఆసక్తికర ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… అలలను ఎవరు ఆపలేరు కానీ అలలను చూసే ప్రయాణం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు… చాలా రోజుల తర్వాత షూటింగ్ కోసం మీ రాఖీ సిద్ధమయ్యాడు అంటూ ఒక ఆసక్తికర పోస్టు పెట్టాడు యష్. దీంతో అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news