మాల్దీవుల్లో రకుల్.. హాట్ ఫోటో వైరల్..!

-

సాధారణంగా కాస్త సమయం దొరికిందంటే చాలు సినీ సెలబ్రిటీలు ఎక్కడికైనా విదేశాలకు ఎగిరి పోతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు ప్రస్తుతం సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాలో షూటింగ్లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇటీవలే లాంగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్… ఆ తర్వాత సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యే లోపు కాస్త సేద తీరాలి అని అనుకుని విదేశాలకు చెక్కేసింది. . ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది రకుల్. ఇటీవలే తన సోదరుడు అమన్ తో కలిసి ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news