బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

-

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఇచ్చిన  ఈ భామ తక్కువ టైంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తన అందం, అభినయంతో టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కోట్లాదిమంది  ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.అయితే ఈ భామ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న సంగతి తెలిసిందే.

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్లాండ్లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ హాజరయ్యారు. రకుల్కి వీరు ముగ్గురూ ఎప్పటి నుంచో స్నేహితులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో రిసార్ట్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుక కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ర‌కుల్ పెళ్లి గ్రాండ్‌గా జ‌రుగ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news