ఆ విషయంలో ప్రభాస్, మహేష్ క్రేజ్ ను దాటేసిన రామ్ చరణ్..

-

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఆయన క్రేజ్ ఎంతలో పెరిగిందో చెప్పటానికి తాజాగా జరిగిన సంఘటన ఉదాహరణ..

 

రంగస్థలం నుంచి విభిన్న కథలతో భారీ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న చరణ్ ప్రస్తుతం.. దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. చరణ్ తన నటనతో పాటు వ్యక్తిత్వంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకొని దేశంలోనే ప్రముఖ స్టార్లలో ఒకరిగా చేరిపోయారు..

తాజాగా రామ్ చరణ్ ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు. టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు.. అయినా 9 మిలియన్ల ఫాలోవర్స్ వద్దే ఆగిపోయారు. ఇక మహేశ్ పాన్ ఇండియాలో అడుగుపెట్టకపోయినా 9.2 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. అయితే వీరి క్రేజ్ ను దాటి మరీ చెర్రీ సోషల్ మీడియాలో హవా చూపించడం విశేషం.. ఈ ఫాలోయింగ్ తో ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టైటిట్ లో ఫ్యాన్స్ చెర్రీని ఆకాశానికి ఎత్తేస్తూన్నారు..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగి మొదటి స్థానంలో ఉన్నారు. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ ను బన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 17 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news