సీఎం రేవంత్ రెడ్డి పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్..!

-

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను అంటూ సీఎంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా? అని నెటిజన్లు ఆర్జీవీని ప్రశ్నించారు. కాగా, ఆర్జీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే.

అయితే వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి కలవడం రాజకీయాల్లో అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఆర్జీవీ కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అయ్యారు. అయితే విషయమేంటంటే? ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించారు. కానీ, ఏపీలో వైసీపీకి ఫుల్ సపోర్ట్ చేసే ఆర్జీవీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news