పుల్లెల‌, నాగ్ అశ్విన్‌ల‌కు రామినేని పుర‌స్కారాలు

-

అమ‌రావ‌తి(గుంటూరు): వివిధ రంగాల్లో రాణిస్తూ స‌మాజానికి విశేష సేవ‌లందిస్తున్న ప‌లువురికి డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌- 2018 పురస్కారాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్ట‌ర్ పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పుర‌స్కారం అందించ‌గా,, ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్ రెడ్డి(మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు విశేష‌ పురస్కారాల‌ను ప్రదానం చేశారు. డాక్ట‌ర్ రామినేని ఫౌండేష‌న్ (యుఎస్ఎ) త‌ర‌ఫున ప్రతి ఏడాది ఈ విశిష్ట‌, విశేష పుర‌స్కారాల‌ను అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెట‌ర్ కపిల్‌ దేవ్, బిసిసిఐ సెల‌క్ట‌ర్ ఎమెస్కే ప్ర‌సాద్‌, సాక్షి మీడియా గ్రూప్ ఈడీ రామచంద్రమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news