అమరావతి(గుంటూరు): వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్న పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్- 2018 పురస్కారాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ పుల్లెల గోపీచంద్కు విశిష్ట పురస్కారం అందించగా,, ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి(మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు విశేష పురస్కారాలను ప్రదానం చేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరఫున ప్రతి ఏడాది ఈ విశిష్ట, విశేష పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, బిసిసిఐ సెలక్టర్ ఎమెస్కే ప్రసాద్, సాక్షి మీడియా గ్రూప్ ఈడీ రామచంద్రమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పుల్లెల, నాగ్ అశ్విన్లకు రామినేని పురస్కారాలు
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
రేవంత్ రెడ్డి నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టాడు: దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డి మీద కుక్క మేక కథని చెప్పారు దాసోజు శ్రవణ్....
తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఏ పార్టీ వైపో తెలుసా..?
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక ప్రకటన చేసింది. ఏపీ ఎన్నికలలో...
అసదుద్దీన్ ఒవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ...
Anji N -