కాంగ్రెస్ కి అత్యధిక స్థానాలు వస్తాయి.. పూర్వ వైభవం వస్తుంది: రంజిత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తిగా అమలు చేసే బాధ్యత తనది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం రెండు సెట్ నామినేషన్ వికారాబాద్ డిసిసి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దేశంలో అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ పేరుతో మ్యానిఫెస్టో తీసుకు వచ్చారని ఆయన అన్నారు.

Ranjith Reddy

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు ముస్లింలు సిక్కులు ఇతర పార్టీ వర్గాల వాళ్ళు అందరూ బయటకు వచ్చి తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని అన్నారు. తాము ఇంటింటికి ప్రచారం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news