మోడల్‌పై అత్యాచారం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

-

రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. పరిచయం ఉన్న వ్యక్తులే ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతిని అతి దారుణంగా అత్యాచారం చేసి రోడ్డుపై పడేసిన ఘటన మరవక ముందే కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చే విద్యార్థిని ఐదుగురు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. మొన్నటికి మొన్న గుంటూరులో వేరే వ్యక్తితో చనువుగా ఉందని ఓ యువతిని చంపి కాలువలో పడేశాడు ఓ దుర్మార్గుడు.

అత్యాచారం
అత్యాచారం

నిర్భయ చట్టం రికార్డుల్లోనే కానీ నిజ జీవితంలో ఆడవారికి రక్షణ కల్పించలేక పోతుందనే వాదనలకు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మోడల్‌పై తనకు పరిచయం ఉన్న వ్యక్తే అత్యాచారం చేశాడు. నమ్మి కలవడానికి వెళ్లిన ఆ యువతిపై అతి దారుణంగా ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.

అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో నివాసముండే బాధితురాలికి ముంబైకు చెందిన వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో అతడు తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. ఈ విషయం ఆ మోడల్‌కు చెప్పి కలవాలని కోరాడు. తన స్నేహితుడికి తెలిసిన ప్లేస్ ఉందని చెప్పి అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేద్దామని ఆ యువతిని నమ్మించాడు. అతడి మాయమాటలు నమ్మిన ఆ యువతి ఆ చోటుకు వెళ్లింది. ఆపై ఆమెను ఢిల్లీని చాణక్యపురి ప్రాంతంలోని ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి పేర్కొంది. బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఓ బృందాన్ని ముంబైకి పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news