తెలంగాణలో మరో దారుణం..మహిళపై అత్యాచారం అపై హత్య..!

-

తెలంగాణ లో మరో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై ఇద్దరు మానవ మృగాలు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..ఈ ఘటన నల్గొండ జిల్లాల్లో చోటు చేసుకుంది. జిల్లాలో ఓ గ్రామానికి చెందిన వివాహిత (54) పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కిరాణా దుకాణం నిర్వహిస్తున్న సదరు మహిళ ఇంటికి వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పుల్లయ్య, లింగయ్య లు అడ్డగించారు. లింగయ్య మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ తలను నెలకు బాది హత్య చేశారు.

rape
rape

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన పై సమాచారం అందిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే నిందితులు ఈ. దారుణం కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా రాష్ట్రం లో సంచలనం సృష్టించిన చైత్ర ఘటన మరవకముందే మళ్లీ అలాంటి దారుణాలు భయట పడటం ఆందోళన కలిగిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడినా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ ఘటన లో కూడా చిన్నారి చైత్ర కు జరిగిన విధంగానే న్యాయం జరగాలని బాధితురాలి బందువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news