Rashmika Mandanna : ఆ సీక్రెట్‌ చెప్పేసిన రష్మిక మందన్న

-

రష్మిక మందన్న ఛలో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. వచ్చీరాగానే తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. తన క్యూట్ నెస్ తో ఈ భామ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది.  పుష్పతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందింది. తాజాగా రష్మిక మందన్న.. తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన వారసుడుతో థియేటర్లోకి వచ్చింది.

రష్మిక పోస్ట్‌ చేసే ఫొటోల్లో తన చేతిపై ఇర్రీప్లేసబుల్‌ అనే టాటూ కనిపిస్తుంటుంది. దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘మొదట నాకు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు. మా కాలేజీలో ఒక అబ్బాయి ‘ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా భయమే’ అన్నాడు. అది తప్పు అని నిరూపించాలని నేను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ ఏం వేయించుకోవాలో తెలీలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఎవరూ మరొకరిని భర్తీ చేయలేరని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఇదే అర్థం వచ్చేలా ఇర్రీప్లేసబుల్‌ అనే పదాన్ని వేయించుకున్నా’’ అంటూ తన టాటూ వెనక ఉన్న రహస్యాన్ని తెలిపింది ఈ నేషనల్‌ క్రష్‌.

ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’ లో నటిస్తోంది. మరోవైపు సిద్ధార్థ్‌ మల్హోత్ర స్పైథ్రిల్లర్‌ ‘మిషన్‌ మజ్ను’లో కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news