రాజమండ్రి జైలులో రవితేజ.. మ్యాట‌ర్ ఏంటంటే..?

-

మాస్ మహారాజ రవితేజ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `క్రాక్` సినిమా చేస్తున్నాడు ఈయన. గోపీ గత సినిమా విన్నర్ విడుదలై మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. అయిన‌ప్ప‌టికీ ర‌వితేజ ఆయ‌న‌కు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసి.. మంచి టాక్ సంపాధించుకుంది. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో క్రైం అంశాలని కూడా కథలో ఇన్వాల్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక రవితేజ ఒక మాస్ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ సెంట్రల్ జైలుకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది చిత్రృందం. క్రాక్ సంబందించి ఇదే లాస్ట్ షెడ్యూల్. దీంతో ఏప్రిల్ 2 వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. దీంతో టాకీ పూర్తవుతుంది. సో.. ర‌వితేజ ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌లో ఉన్నాడ‌న్న‌మాట‌.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సమ్మర్ స్పెషల్‌గా మే 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు చిత్ర‌యూనిట్‌. కాగా, వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news