అభివృద్ధిపై బ‌హిరంగ‌ చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. చంద్ర‌బాబుకు అంబ‌టి స‌వాల్

-

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ సుప‌రిపాల‌న చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక పోతున్నాడ‌ని మండిప‌డ్డారు. అందుకే త‌మ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ప‌నికిమాల‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన 34 నెల‌ల్లోనే అనేక సంస్క‌ర‌ణ‌లు చేశారని అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఎన్ని సంస్క‌ర‌ణ‌లు చేసింద‌ని ప్ర‌శ్నించారు.

టీడీపీ, వైసీపీ ప్ర‌భుత్వాలు చేసిన అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? అని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు స‌వాల్ విసిరారు. అభివృద్ధిపై బ‌హిరంగ చర్చ‌కు నారా లోకేష్ ను పంపించినా.. తాము సిద్ధమ‌ని అంబటి రాంబాబు ప్ర‌క‌టించారు. నారా లోకేష్ కు త‌మతో చ‌ర్చకు వ‌చ్చే స్థాయి లేకున్నా.. తాము సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం అని అన్నారు. ఆ రోజు చంద్ర‌బాబు ఆరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news