Breaking : కత్తి దాడిలో గురైన రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి

-

కత్తి దాడికి గురై ఆస్పత్రి లో చికిత్స పొందుతూ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి చెందారు. రవీందర్ రెడ్డిపై అల్లుడు మోహన్ రెడ్డి కత్తితో దాడి చేసారు.. తీవ్ర గాయాలతో అపోలో లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే రవీందర్ రెడ్డి మరణించారు. ఇక మరికాసేపట్లో రవీందర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియకు తరలించనున్నారు పోలీసులు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేసిన రవీందర్ రెడ్డి… రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలం కొనుగోలు లో మధ్యవర్తిత్వం వహించిన మోహన్ రెడ్డి… తనకు రావాల్సిన కమిషన్ డబ్బులు ఆరు లక్షలు ఇవ్వకపోవడంతో కక్ష్య పెంచుకున్నాడు.

తన కమిషన్ ఇవ్వకుండా రెండు నెలల క్రితం రవీందర్ రెడ్డి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఆగ్రహం తో ఊగిపోయాడు మోహన్ రెడ్డి. దీంతో హతమార్చలని భావించి కత్తితో దాడి చేసాడు మోహన్ రెడ్డి. అయితే ఈ ఘటన లో రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి చెందారు. రవీందర్ రెడ్డి హత్య వెనుక మోహన్ రెడ్డి తో పాటు మరికొందరు ఉన్నారని..మోహన్ రెడ్డి తన భర్త ఊరికి చెందిన వాడేనని ఆరోపిస్తున్నారు రవీందర్ రెడ్డి భార్య అమూల్యా. ఇక ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news