తెలంగాణాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్ లు… ఇదే ప్రాసెస్

-

లాక్ డౌన్ సడలింపు లతో ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం అయ్యాయి అని తెలంగాణా ప్రభుత్వం వెల్లడించింది. భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కార్యకలాపాలు ఉంటాయని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఆన్ లైన్ లో ఈ పాసుల జారీ చేయనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా డాక్యుమెంట్లను ఒక్కసారి మాత్రమే పరిశీలన ఉంటుంది అని అధికారులు స్పష్టం చేసారు. ఇక నిన్న జూన్ 10 వరకు లాక్ డౌన్ ని పెంచుతూ తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news