బ్రేకింగ్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల, తెలంగాణలో 12, ఏపీ 11 స్థానాలు !

-

రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉండగా…  కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి.

వీటన్నిటికీ తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా… నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణ కు చివరి తేదీ అని పేర్కొంది. అలాగే.. నవంబర్ 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా… నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. అలాగే…ఈ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 10 ఉండనుండగా… డిసెంబర్ 14 వ తేదీన కౌంటింగ్ జరుగనుంది.  అటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏకంగా 11 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news