కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదు – రేవంత్ రెడ్డి

-

కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారు…ఉమ్మడిపాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని నిప్పులు చెరిగారు కేసీఆర్‌.

వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని…భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని వివరించారు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని… పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version