మునుగోడులో బీజేపీ సోషల్ మీడియాలో బరితెగించింది – రేవంత్‌

-

మునుగోడులో బీజేపీ సోషల్ మీడియాలో బరితెగించిందని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ను మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే..దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు.

దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news