తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది అని రేవంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు. అలానే రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి, 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెప్తున్నాయన్నారు. అలానే ఈ పోస్ట్ లోనే ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని అన్న కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదన్నారు. అలానే మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని, పూర్తిగా పున: నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది అని పోస్ట్ చేసారు రేవంత్ రెడ్డి.

ఈ నేపథ్యం లో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన అని అన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం అని చెప్పారు. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు అని పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news