బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రియాక్షన్.. నెక్స్ట్ ప్రపంచ సమితేనంటూ సెటైర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని చంపేశారని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే కేసీఆర్ బీఆర్​ఎస్​ను తీసుకొచ్చారని రేవంత్ ఆరోపించారు.  తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, ఆ పదాన్ని చంపేయాలనుకుంటున్న వ్యక్తి కేసీఆర్‌ అని మండిపడ్డారు. తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా తాను కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోవాలని ప్రజలకు సూచించారు. దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టాలని.. తాను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news