ఏపీలోనూ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ హోర్డింగులు

-

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని జాతీయ పార్టీ(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ పోస్టర్లు, హోర్డింగులతో నగరమంతా గులాబీమయమైంది.

కేవలం తెలంగాణలోనే కాకుండా బీఆర్ఎస్ పోస్టర్లు ఏపీలోనూ వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ బీఆర్ఎస్ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై  వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news