తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి కాసేపట్లో బాధ్యతలు

-

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత సభలో ప్రసంగించనున్నారు. . అంతకుముందు రేవంత్‌రెడ్డి.. 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీభవన్‌కు రేవంత్ వెళ్తారు. 1.30 గంటలకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌‌తో పాటు గోవా, అండమాన్‌ పీసీసీల అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news