ఓటుకు నోటు కేసులో ట్విస్ట్ : విచారణకు రేవంత్

-

ఓటుకు నోటు కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి… కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం పూట నాంపల్లి ఏసీబీ కోర్టు లో రేవంత్ రెడ్డి ఇ హాజరయ్యారు. రేవంత్ రెడ్డి తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహ మరియు సెబాస్టియన్ కూడా హాజరయ్యారు.

కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షుల న్యాయస్థానం నమోదు చేసింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిఏ సైదయ్య మరియు నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన రెడ్డి ల వాంగ్మూలాలను కూడా ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం నమోదు చేసింది. నరేందర్ రెడ్డి బంధువులతోపాటు మరొకరు గురువారం విచారణకు హాజరయ్యారు. వారిని కూడా ఏసీబీ కోర్టు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news