సీబీఐ కార్యాలయానికి చేరుకున్న రియా చక్రవర్తి..!

-

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటు బాలీవుడ్, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు ఎంత దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ కేసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని రియాకు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి అన్ని ఆధారాలతో రియా చేరుకున్నారు. రియాతోపాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీని మరోసారి ప్రశ్నించనున్నారు. కాగా, ఇప్పటికే రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని అధికారులు ప్రశ్నించారు. ఇకపోతే జూన్ 14వ తేదీన త‌న ఇంట్లో సుశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news