విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవాలంటే.. ఫ్రిడ్జ్ ను ఇలా వినియోగించాలి..!

-

సహజంగా ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దాని వినియోగం వలన పవర్ బిల్ కూడా ఎక్కువగా ఉంటుంది అని భావిస్తారు. కొన్ని సందర్భాలలో ఎన్నో కారణాల వలన ఫ్రిడ్జ్ సరిగా కూలింగ్ అవ్వదు. దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ ఆన్ లో ఉన్నప్పటికీ సరిగ్గా చల్లబడకపోవడం లేక కరెంట్ బిల్ ఎక్కువగా రావడం వంటివి జరుగుతుంటే అందరూ కంగారు పడుతూ ఉంటారు.

అటువంటి సందర్భంలో ఫ్రిడ్జ్ ను గోడకు ఎంత దగ్గరగా ఉంచారో చూసుకోవాలి. ఎప్పుడైతే గోడకు ఫ్రిడ్జ్ దగ్గరగా ఉంటుందో, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది లేక ఎయిర్ వెంటిలేషన్ కు అంతరాయం కలిగినప్పుడు లోపల కూలింగ్ సరిగ్గా ఉండదు. ఫ్రిజ్ లోపల గడ్డకట్టడం లేక చల్లదనం తగ్గడం వంటివి ఎదురవుతాయి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, కచ్చితంగా ఫ్రిడ్జ్ ను గోడకు కొంచెం దూరంలో ఉంచాలి. వేసవి లేదా శీతాకాలంలో అయినా సరే ఈ జాగ్రత్తలను పాటించాలి. కొంతమంది ఫ్రిడ్జ్ ను పూర్తిగా గోడకు దగ్గరగా ఉంచుతారు లేక ఎంత దూరం వుంచాలో తెలియక సరైన పద్ధతులు పాటించరు.

నిపుణుల ప్రకారం, ఎప్పుడైతే ఫ్రిజ్ ను గోడకు సరైన దూరంలో ఉంచుతారో, కూలింగ్ మోటర్ నుండి వచ్చే వేడి సరిగ్గా బయటకు వెళ్తుంది. దీంతో కూలింగ్ సరైన విధంగా జరుగుతుంది మరియు విద్యుత్ బిల్లు తగ్గుతుంది. అలాగే వెంటిలేషన్ కూడా సరైన విధంగా జరుగుతుంది. కనుక ఫ్రిడ్జ్ మరియు గోడకు కనీసం నాలుగు అంగుళాలు లేదా 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఎప్పుడైతే సరైన విధంగా ఉంచరో, కంప్రెసర్ పై లోడ్ పెరుగుతుంది మరియు ఫ్రిజ్ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఫ్రిజ్ జీవితకాలాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news