చెరువులోకి దూసుకు పోయిన బస్సు…!

-

కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనుషుల ప్రాణాలు పోయే రోజులు ఇవి. అయితే ఇలాంటి సంఘటన ఒకటి చైనా దేశంలో జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న బస్సు చెరువు లోకి దూసుకెళ్లి పోయింది. అయితే ఆ సమయంలో ఆ చెరువులో నీరు అధికంగా ఉంది.

bus accident
bus accident

దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారందరినీ దగ్గర్లోనే ఆస్పత్రులకు తరలించారు. వీరితో పాటు మరికొందరు ఆ చెరువులో గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే చెరువులో పడి పోయిన బస్సును తీయడానికి ప్రభుత్వ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news