బాలపూర్‌లో రోడ్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

-

హైదరాబాద్ మహానరగంలోని బాలపూర్‌ పరిధి మీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా ఉంటున్న వారి భయాందోళనకు గురిచేసింది. స్థానికుల కథనం ప్రకారం.. మీర్‌పేట సమీపంలోని నందనవనం తీగల కృష్ణారెడ్డి కమాన్ వద్ద ద్విచక్రవాహాన్ని లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైకు మీద వెళ్తున్న దంపతులు రోడ్డు మీద పడిపోయారు. వారిపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news