కాకినాడ సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

-

తూర్పు గోదావరియళ్ళలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాజోలు డిపోకు చెందిన బస్సు మలికిపురం నుంచి విశాఖపట్టణం బయలుదేరింది. బస్సు తిమ్మాపురం-అచ్చంపేట క్రాస్‌రోడ్డుకు చేరుకోగానే కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడి 50 మీటర్ల వరకు ముందుకు దూసుకుపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలినుంచి లారీ డ్రైవర్‌ పరారైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news