ఇజ్రాయెల్ రాకెట్ లాంచ్ మిస్ ఫైర్… చిక్కుల్లో పడిందిగా ?

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా లో హమాస్ ఉగ్ర మిలిటెంట్ లకు మధ్యన జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సైనికులు దాడుల వర్షం కురిపిస్తున్నారు. ఇజ్రాయెల్ కు చెందిన సైనికులు గజ నగరంపై ఎటువంటి విరామం లేకుండా దాడులను చేస్తూనే ఉన్నారు. కాగా ఈ దాడులలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన ఒక రాకెట్ లాంచర్ పొరపాటున ఎయిమ్ మిస్ అయ్యి ఈజిప్టు దేశం సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ పోస్ట్ పై పడింది, దీనితో మిలిటరీ పోస్ట్ పూర్తిగా ద్వంసం అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రదేశం ఇజ్రాయెల్, గాజా మరియు ఈజిప్టు మూడు దేశాలకు సరిహద్దు బోర్డర్ గా ఉంది. ఈ ప్రమాదంపై ఇజ్రాయెల్ డిఫెన్సె ఫోర్స్ వెంటనే స్పందించింది. పొరపాటున జరిగిన ఈ తప్పదని మేము చింతిస్తున్నాము.. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపడుతాము అంటూ ఈజిప్టు దేశానికి తెలియచేసింది.

మరి దీనిపై ఈజిప్టు ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ఈ మిస్ ఫైర్ వలన ఇజ్రాయెల్ కు ఇంకేమి కొత్త చిక్కులు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news