పవన్ కళ్యాణ్ ను “సన్నీ లియోన్” తో పోల్చిన మంత్రి రోజా…

-

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు, ఒకవైపు వాలంటీర్లు మరోవైపు వైసీపీ నాయకులు మరియు ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులు అంతా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక తాజాగా మరోసారి మంత్రి రోజా మీడియాతో పవన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందంటూ రోజా చెబుతూ.. పవన్ మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందని పోల్చి చెప్పింది. ఒకరి మాటకు విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు కాబట్టే తనను భార్యలు వదిలేశారు అంటూ పర్సనల్ కోణాన్ని టచ్ చేసింది రోజా. ఒక సమాచారాన్ని మనము రోజువారీ పనులలో భాగంగా చాలా చోట్ల ఇస్తూ ఉంటాము..

అంతెందుకు బ్యాంక్ ల్లో, మీ సేవ కేంద్రాలలో ఇంకా చాలా చోట్ల ఆధార్ మరియు ఇతర వివరాలను ఇస్తాము.. అంతమాత్రాన వాళ్ళు మన సమాచారాన్ని మిస్ యూజ్ చేస్తున్నారని అనగలమా. వాలంటీర్ల సేవలను ఆలోచిస్తే ఇలా వారి గురించి మాట్లాడారు అంటూ ఘాటుగా బదులిచ్చింది మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news