లోకేష్ ఒక పిల్లి పిత్రి గాడు..ఎక్కువ మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తాం – రోజా

-

నారా లోకేష్ ఒక పిల్లి పిత్రి గాడు..ఎక్కువ మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి వర్యులు రోజా వార్నింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనపై స్పందించారు రోజా. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ … లోకేష్ ఒక పిల్లి పిత్రి గాడని.. అమ్మ, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన మంత్రి అయినా నువ్వా సీఎంను విమర్శిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్ ఏది పడితే అది మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. లోకేష్ ఒక అడ్రస్ లేని వెధవ…. కొడాలి నాని నేను టీడిపి నుంచే వచ్చాము. కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముందన్నారు. నాడు ఎన్టీఆర్ అభిమానులుగా మేము టీడీపీలో ఉన్నామని.. జగనన్న కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు. కొడాలి నాని భాషలో తప్పేముంది… ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news