కొడాలి నాని గడ్డంలో.. తెల్ల వెంట్రుక కూడా పీకలేరు – మంత్రి రోజా

-

కొడాలి నాని గడ్డంలో… తెల్ల వెంట్రుక కూడా పీకలేరని టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు మంత్రి రోజా. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనపై స్పందించారు రోజా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేతలకు సిగ్గు లేదని.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యం అన్నారు.


మూడు రాజధానుల అంశం లేవనెత్తిన తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో మేమే గెలిచామని.. రాజధానిలో ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. లోకేష్ ఒక పిల్లి పిత్రి గాడని.. అమ్మ, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన మంత్రి అయినా నువ్వా సీఎంను విమర్శిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్ ఏది పడితే అది మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. లోకేష్ ఒక అడ్రస్ లేని వెధవ…. కొడాలి నాని నేను టీడిపి నుంచే వచ్చాము. కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముందన్నారు. నాడు ఎన్టీఆర్ అభిమానులుగా మేము టీడీపీలో ఉన్నామని.. జగనన్న కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేల ఇళ్లపైకు వస్తే తరిమి తరిమి కొడతామని.. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news