ఇవాళ బీఎస్పీలో చేరనున్న ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

-

ఐపిఎస్ అధికారిగా స్వఛ్చంద పదవీ విరమణ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్‌పిలో చేరనున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో బహుజన సమాజ్‌ పార్టీ నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలోనే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్‌పి తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ రోజు నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్, ఎంపి రాంజీ గౌతం నేతృత్వంలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారు. ఇక ఇప్పటికే ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించు కునేందుకు అనుమతివ్వాలని జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అంశాలే ఎజెండాగా ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు. గడిచిన 15 రోజులుగా బీఎస్పీ, స్వేరోస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నల్లగొండ సభకు రావాలని విజ్ఞప్తులు చేశారు ప్రవీణ్‌ కుమార్‌. కాగా.. ఇటీవలే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news