ఎన్నికల వేళ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు

-

రేపు జరగబోయే ఎన్నికల కోసం ఓటు వేయడానికి తమ సొంత గ్రామాలకు బయలుదేరిన ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వైపు ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టడం జరిగింది అని ఆర్టీసీ ఎండి తెలిపారు. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

విజయవాడ రూట్‌ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని ,టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం https://tsrtconline.in వెబ్‌ సైట్‌ ని సంప్రదించాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి ఆయా జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతోంది.ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news