తాజ్ మహల్‌ను సందర్శించిన సచిన్ టెండూల్కర్

-

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజ్ మహల్ వద్ద సందడి చేశారు. సచిన్ తన భార్య అంజలితో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. చారిత్రత్మక తాజ్ మహల్‌ను చూసి ఆయన మంత్రముగ్ధులయ్యారు.వాలంటైన్స్ డే గడిచిన మరుసటి రోజే టెండూల్కర్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

తాజ్‌మహల్‌ను చూసేందుకు సచిన్ తన భార్య అంజలితో కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చేరుకున్న తర్వాత ఘనస్వాగతం లభించింది.సచిన్ దంపతులు తాజ్‌మహల్‌ను వీక్షిస్తున్న సమయంలో అధిక సంఖ్యలో ఫ్యాన్స్, టూరిస్టులు చూసేందుకు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారికి నిరాశే ఎదురైంది.గతంలోనూ పలుమార్లు సచిన్ తాజ్ మహల్‌ను సందర్శించారు. ఇండియాలోని 7 అద్భుతాలలో తాజ్ మహల్ ఒకటి.

Read more RELATED
Recommended to you

Latest news