భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కి కరోనా

-

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్ కి కరోనా సోకింది. యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సైనా, ప్రణయ్ లు కలిసి ఆడుతున్నారు. ఇవాళ జరగనున్న మహిళల సింగిల్స్ లో మలేషియా షెట్లర్ కిసోనా సెల్వదురైతో సైనా మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ బ్యాంకాక్ చేరుకున్న తర్వాత మూడవ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ అని తేలింది.

10 నెలల తర్వాత సైనా అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న నేపధ్యంలో ఈ కరోనా సోకడం సంచలనంగా మారింది. ఇక ఈ కరోన సోకిన విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా సోకడంతో ఈ ఇద్దరు ప్లేయర్లు టోర్నమెంట్ లో ఆడడం లేదు. వీరిద్దరినీ బ్యాంకాక్ లోని ఒక హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉంచారు. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news