హీరో సిద్దార్థ్ కు జాతీయ మహిళ కమిషన్ షాక్… ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ఆదేశం

-

హీరో సిద్ధార్థ్ కు జాతీయ మహిళా కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం ట్విట్టర్ ఇండియాకు లేఖను కూడా రాసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషిగా.. అవమాన పరిచేలా ఉన్నాయని లేఖలో పేర్కొంది. అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ… సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై డీజీపీని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇటీవల సైనా నెహ్వాల్ పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్ చేసింది. దీనికి రిప్లై ఇస్తూ సిద్ధార్థ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇలాగే బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోదీపై కూడా విమర్శలు చేశారు. అయితే.. ఈ ట్విట్ పై మహిళలు కూడా మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news