పవన్ మనసులో ఏముందో తెలిసింది : సజ్జల

-

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయ కూడదనేదే తన నిర్ణయమంటూ.. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్ . వామపక్షాలతో కలిసి తనకు పోరాటం చేయాలని తనకు ఉందని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కల్యాణ్ ఇమేజ్ నీటి బుడగ అంటూ కౌంటర్ ఇచ్చారు.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారని చెప్పారు. పవన్ మనసులో ఏముందో బట్టబయలైందని, చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ అజెండా అని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని పవన్, చంద్రబాబు అంటున్నారు… ఆ మాట ప్రజలు అనడంలేదు. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు కలలే పవన్ కల్యాణ్ కలలు… చంద్రబాబు ఊహలే పవన్ ఊహలు అన్నట్టుగా ఉంది. దుష్ట శక్తులన్నీ ఏకం అవుతున్నాయని జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది” అని సజ్జల అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version