దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ ఎలా జ‌రిగిందంటే: స‌జ్జ‌నార్

-

దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ ప్రజలు హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దిశను హతమార్చిన చోటే ఈ దుర్మార్గులను అంతమొందించారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది పోలీసులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్ లాక్కున్నాడని… మిగిలిన ముగ్గురు నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు.

పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని… ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని… అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్ారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.15 ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ నలుగురు కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. వీరి నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news