కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య!

-

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్ లో దారుణ హత్య జరిగింది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని హత్య చేసారూ గుర్తుతెలియని దుండగులు. సెలూన్ లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దుండగులు…పరారయ్యారు. ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి సెలూన్ దగ్గరికి కుటుంబ సభ్యులు వెళ్లారు. సెలూన్ షేట్టర్ పైకి లేపడంతో చనిపోయి ఉన్నాడు సెలూన్ యజమాని అశోక్.

దింతో పోలీసులకు సమాచారం అందించిన సెలూన్ యజమాని అశోక్ భార్య. ఈ సందర్భ0గా హత్యకు గురైన సెలూన్ నిర్వాహకుడు అశోక్ భార్య నీరజ మాట్లాడుతూ….నిన్న మధ్యాహ్నం రోజు మాదిరిగానే లంచ్ చేసి వెళ్ళిపోయాడు… మా ఇంటి నుంచి చూస్తే సెలూన్ కనబడుతుందని పేర్కొంది. నిన్న సాయంత్రం సెలూన్ క్లోజ్ చేసి ఉండడం ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో నా కొడుకును సెలూన్ దగ్గరికి పంపించాను…సెలూన్ దగ్గరికి వెళ్లేసరికి సెటర్ క్లోజ్ చేసి ఉండడం కింద అశోకు బైక్ ఉన్నట్లు మా అబ్బాయి చెప్పాడన్నారు. షట్టర్ ఓపెన్ చేసి చూసే వరకే రక్తపు మడుగులో అశోక్ ఉన్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news