సమంతకు కూకట్ పల్లి కోర్టులో ఊరట.. ఆ కంటెంట్ తొలగించాలని కోర్టు ఆదేశాలు

-

నటి సమంతకు కూకట్ పల్లి కోర్ట్ లో ఊరట లభించింది. తనపై వ్యక్తిగతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దాఖలు చేసింది. దీంతో కూకట్ పల్లి కోర్ట్ కు ఈవ్యవహారం చేరింది. కోర్ట్ సమంత ఫిర్యాదుపై ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. సమంతపై పెట్టిన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి సదరు యూట్యూబ్ ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ ప్రసారాాలు చేసిన యూట్యూబ్ లింకులను తొలగించాలని ఆదేశించారు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించరాదని కోర్ట్ తెలిపింది.

ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయొద్దని, ఇక మీదట ఎటువంటి విడియోలు, వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇదేవిధంగా సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెట్టవద్దని కూకట్ పల్లి కోర్ట్ సూచించింది.ఇటీవల నాగచైతన్యతో సమంత విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. పలు యూట్యూబ్ ఛానెళ్లు వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా పలు వీడియోలను ప్రచారం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news