సమంత, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి : కేఏ పాల్

-

అక్కినేని నాగార్జున కుటుంబంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించబోయి సమంత – నాగచైతన్య విడాకుల అంశాన్ని మంత్రి సురేఖ తెరమీదకు తేవడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలో పెను వివాదానికి దారితీశాయి.

ఈ క్రమంలోనే దానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి కొండా సురేఖ మరోసారి మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా సమంతకు క్షమాపణలు చెప్పారు.అయినప్పటికీ ఈ గొడవ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తీవ్రంగా మారింది. తాజాగా దీనిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొండా సురేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. 72 గంటల్లో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అలాగే, సమంత, నాగార్జున ఇంటికి వెళ్ళి మరీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేఏ పాల్ హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news