గెలాక్సీ ట్యాబ్ ఎ7 ను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ట్యాబ్ ఎ7 పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భార‌త్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 10.4 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనిపై ప‌లు ప్రీబుకింగ్ ఆఫ‌ర్స్‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్ డార్క్ గ్రే, సిల్వ‌ర్‌, గోల్డ్ పేరిట 3 క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తోంది. ఇందులో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. 1టీబీ వ‌ర‌కు కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్‌డీ కార్డుల‌ను ఇందులో వేసుకోవ‌చ్చు.

Samsung Galaxy Tab A7 launched in India

ఈ ట్యాబ్ వినియోగ‌దారులు రెండు వేరియెంట్ల‌లో అందుబాటులో ఉంది. ఎల్‌టీఈ మోడ‌ల్ ధ‌ర రూ.21,999 ఉండ‌గా, వైఫై మోడ‌ల్ ధ‌ర రూ.17,999గా ఉంది. వీటిని వినియోగ‌దారులు ప్ర‌స్తుతం ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఎంపిక చేసిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ట్యాబ్ ముందుగా ల‌భ్యం కానుంది. ఈ ట్యాబ్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల‌తో ప్రీ బుకింగ్ చేసుకున్న‌వారికి రూ.2వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే కేవ‌లం రూ.1875కే కీబోర్డ్ క‌వ‌ర్‌ను ఇస్తారు.

ఈ ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్ స‌రౌండ్ సౌండ్ ఫీచ‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 7040 ఎంఏహెచ్ బ్యాట‌రీని అందిస్తున్నారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఉంది. ఈ ట్యాబ్‌లో ఆటో హాట్ స్పాట్‌, క్విక్ షేర్ వంటి ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news