ఒక ఆత్మహత్య పై ఇంత రాద్ధాంతమా : శరత్ పవర్

-

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చిత్ర పరిశ్రమలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో రోజుకొక కొత్త అంశం బయట పడుతూనే ఉంది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు సుశాంత్ ఆత్మ హత్య కేసు. తాజాగా దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పై తీవ్రమైన చర్చ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. అంతేకాకుండా ఒక ఆత్మహత్య పై ప్రభుత్వం ఎన్ని రోజులు రాద్ధాంతం చేయడం అవసరమా అంటూ ఫైర్ అయ్యారు శరద్ పవర్. ప్రభుత్వం అనవసర వివాదాల జోలికి వెళ్లకూడదని రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ప్రభుత్వం ఆ సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది అని సూచించారు. ప్రస్తుతం శరత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news