సర్కారు వారి పాట మూవీలో విలన్ల రాజకీయం.. మామూలుగా లేదుగా.. ?

-

సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబుకు ఇచ్చిన జోష్ మామూలుగా లేదు.. ఖత్ర్నాక్ పంచ్‌లతో కామెడి పండించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రిన్స్ అభిమానులతో పాటుగా ప్రేక్షకుల అందర్ని మెప్పించింది.. ఇలా వరుసగా మూడు విజయాలతో కెరీర్ బెస్ట్ స్పీడ్ మీదున్న మహేష్ బాబు ప్రస్తుతం, గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా కధ విషయానికి వస్తే బ్యాంక్‌లో భారీగా లోన్స్ తీసుకున్న విలన విదేశాలకు పారిపోతే అతన్ని హీరో ఎలా ఇండియా కి రప్పించి లోన్ కట్టించాడు అన్న స్టొరీ పాయింట్ తో రూపొందబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీ లెవల్ లో ఉన్నాయి.

అయితే ఈ చిత్రంలో టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఇంకా కన్ఫాం కాలేదు కానీ కీలక పాత్రలకు వేట కొనసాగుతుందని సమాచారం, ఇదివరకే హీరోయిన్ గా చాలా మందినే అనుకున్నా కీర్తి సురేష్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని తెలుస్తుంది. ఇక సినిమాలో విలన్ రోల్ కోసం ఎన్నో తర్జనబర్జనలు పడుతున్నారట చిత్రయూనిట్.. ఈ నేపధ్యంలో ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు.

 

మొదటగా ఈ చిత్రానికి విలన్‌గా కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ని ట్రై చేయగా రెస్పాన్స్ రాలేదు, తర్వాత ఉపేంద్ర ని అనుకున్నారు కానీ ఎందుకనో అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ ఈ మధ్య కాలంలో స్టైలిష్ విలన్ గా మెప్పించిన అరవింద్ స్వామి, ధృవ లో రామ్ చరణ్ కి పోటిగా నటించి మెప్పించాడు, అయితే ఇతన్ని సర్కారు వారి పాట చిత్రం కోసం సంప్రదించినప్పుడు 6 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే నిజం అయితే విలన్ రోల్ కి బిగ్గెస్ట్ రేటు అనే చెప్పాలి. కానీ ఇంకా అరవింద్ స్వామీ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.. చూశారుగా ఈ సినిమా కోసం విలన్ల రాజకీయం..

Read more RELATED
Recommended to you

Latest news