“సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ముహుర్తం ఫిక్స్

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ కు మూహుర్తం ఖరారు అయింది. ఈ సినిమాలోన మొదటి పాటను లవర్స్‌ డే రోజున అంటే ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సంగీత దర్శకుడు ఎస్‌ ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ వాయిస్తున్న పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. కాగా ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news